రీల్ విలన్గా .. రియల్ హీరోగా సోనూసూద్ ఎంత పాపులరో తెలిసిందే.. కరోనా టైంలో కష్టాలో ఉన్నవారిని ఆదుకుంటూ మనసున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సాయం కోరినవారికి తన స్టైల్ లో సాయం చేస్తూనే ఉన్నాడు. అందుకే సోనూకి మన దేశంలో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. రీసెంట్ గా మహారాష్ట్రలోని ఓ అభిమాని సోనూ కోసం రెండు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు.
మహారాష్ట్రలోని వషీమ్ ప్రాంతానికి చెందిన నారాయణ్ కిషన్ లాల్ వ్యాస్ అనే సైక్లిస్ట్ గత ఐదేళ్లుగా జాతీయ సమస్యల మీద సైక్లింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతను సోనూసూద్ మీద ఉన్న అభిమానంతో తన సైక్లింగ్ సాహసాన్ని అంకితమిస్తూ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు రెండు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేయనున్నట్లు ప్రకటించాడు.
మహారాష్ట్ర నుంచి హైదరాబాద్, బెంగళూరు, మధురై మీదుగా రామసేతు వరకూ రైడ్ చేస్తానని తెలిపాడు. అయతే ఇలా తన కోసం ఒకరు సైకిల్ రైడ్ చేస్తున్నారని తెలుసుకున్న సోనూసూద్ “తనకోసం కిషన్ లాల్ చేయాలనుకుంటున్న సైక్లింగ్ రైడ్.. తాను ఎప్పటికీ పొందలేని అతిపెద్ద పురస్కారం” అని ప్రశంసించాడు.
@SonuSood Ride for Real Hero of india 2000 km Centre India toThe last land of India Ram Setu.Real Hero SonuSood has emerged as a true hero in dark times. Now our Turn to salute his work thank you so much for helping people in dark time.Cyclist Narayan Vyas from washim Maharashtra pic.twitter.com/Xy9V3tQRfm
— Narayan Vyas (@Narayan19171470) January 27, 2021