ఇండియాలో కరోనా కట్టడికి కళ్లెం పడడం లేదు. అంతకంతకు పెరుగుతున్న కేసులతో దేశంలో బాధితుల సంఖ్య 73లక్షలకు చేరింది. నిన్నటికి నిన్న 67వేల 708కొత్త కేసులు వెలుగులోకి రాగా..మొత్తం కేసుల సంఖ్య 73లక్షల 07వేల 098కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24గంటల్లో 680మంది మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 1లక్షా 11వేల 266కు చేరిందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 8లక్షల 12వేల 390యాక్టివ్ కేసులుండగా.. కోలుకున్న వారి సంఖ్య 63లక్షల 83వేల 442గా ఉన్నట్టు పేర్కొంది.