భారత్ ఓపికకు పరీక్ష పెట్టి రిస్క్ చేయొద్దని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె శత్రు దేశాలను హెచ్చరించారు. నార్త్ బోర్డర్ లో జరుగుతున్న కుట్రను సమర్ధవంతంగా తిప్పికొట్టామని అన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్లో శుక్రవారం జరిగిన ఆర్మీ డే పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ నరవణె.. ఆ సందర్భంగా మాట్లాడారు. లఢక్ లో ఉద్రిక్తత కొనసాగుతున్న పరిస్థితుల్లో జనరల్ నరవణె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, చైనాతో సరిహద్దు ఇష్యూని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోందని ఆయన అన్నారు.
గత సంవత్సరం జూన్లో లద్దాఖ్లో గల్వాన్ హీరోలు చేసిన ప్రాణత్యాగం వృధా కాదని, దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ప్రమాదం వాటిల్లనివ్వబోమని చెప్పారు. తీవ్రమైన చలి పరిస్థితుల్లోనూ భారత సైనికుల స్థైర్యం దెబ్బతినలేదని. అక్కడి పర్వతాల కన్నా ఎత్తుగా వారి ధైర్య, సాహసాలున్నాయి అని అన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవ్వాలని భారత్ కోరుకుంటుందని. అలాగని ఓపికను పరీక్షించే ఊరుకునేది లేదని అన్నారు. ఎంతచెప్పినా పాక్ ఇంకా టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉందని పాకిస్తాన్పై మండిపడ్డారు.