తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పింక్ డైమండ్ ఇష్యూ మరోసారి చర్చకు వచ్చింది. పింక్ డైమండ్ పై మరోసారి విచారణకు ఆదేశించాలని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ దాఖలు చేశాడు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, మాజీ ఈవోలు ఐవైఆర్ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం లను ప్రతివాదులుగా చేర్చాడు. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్కుమార్తో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ‘పింక్ డైమండ్ పై మరోసారి విచారణ అవసరం లేదు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రెండు కమిటీలు విచారణ జరిపాయి. నివేదికలు కూడా అందాయి’ అని కోర్టు చెప్పింది.