తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే సీఎం అభ్యర్థిగా ఎడప్పడి పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం ఖరారయ్యారు. చెన్నైలో ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశమై సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులను ఖరారు చేసింది. అదే విధంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక, ఇతర పార్టీలతో పొత్తులు, సీట్ల పంపకం తదితర అన్ని విషయాల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి, పార్టీ కోఆర్డినేటర్ పన్నీర్ సెల్వం లకే నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కట్టబెట్టారు. ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కోయంబేడు-మదురవోయల్ రహదారిలోని పార్టీ కార్యాలయం వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.