దేశ చరిత్రలోనే పెట్రోల్ రేటు గరిష్ఠ స్థాయికి చేరింది. చమురు కంపెనీలు గురువారం మరో 23 పైసలు, డీజిల్పై 26 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు లీటర్కు రూ.84.20 చేరింది. కోల్కతాలో రూ.85.68, ముంబైలో రూ.90.83, హైదరాబాద్లో 87.59, చెన్నైలో రూ.86.96, బెంగళూరులో 87.04, భువనేశ్వర్ రూ.84.68, జైపూర్లో రూ.92.17కు చేరింది.
ఢిల్లీ డీజిల్ రేటు లీటర్కు 26 పైసలు పెరగ్గా ప్రస్తుతం రూ.74.38కి చేరింది. కోల్కతాలో రూ.77.97, ముంబైలో రూ.81.07, చెన్నైలో రూ.79.72, బెంగళూరులో రూ.78.87, హైదరాబాద్లో రూ.81.17, జైపూర్లో రూ.84.14కు చేరింది.