దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్టైమ్ గరిష్టానికి చేరాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దేశీ ఇంధన ధరలు రికార్డ్ స్థాయికి చేరిన నేపథ్యంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ వాహనదారులకు ఊరట కలిగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ సమయంలో కేంద్రం పెంచిన ఎక్సైజ్ డ్యూటీలో 50 శాతం తగ్గింపు ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పెట్రోల్ ధరలు లీటరుకు రూ.5 వరకు తగ్గే అవకాశ ఉంది. కరోనా వైరస్ సమయంలో పెట్రోల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని రూ.10 వరకు పెంచిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి అనుగుణంగా రేట్లు తగ్గిస్తే.. అప్పుడు వినియోగదారులకు పూర్తి ప్రయోజనం కలుగుతుంది. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు నిలకడగానే కొనసాగాయి. దీంతో హైదరాబాద్ శుక్రవారం పెట్రోల్ ధర రూ.87.59, డీజిల్ ధర రూ.81.17 ఉంది.