ఇన్ స్టంట్ మనీ యాప్స్ కాల్ సెంటర్ల కేసు దర్యాప్తులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగం పెంచారు. కాల్ సెంటర్లో పనిచేసే 610 మంది ఉద్యోగులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసారు. క్రైమ్ పోలీసులు మొత్తం 30 ఇన్ స్టంట్ మనీ యాప్స్ ను గుర్తించారు. కస్టమర్లకు నగదు బదిలీ చేసిన ఇన్ స్టంట్ మనీ ఫైనాన్స్ యాప్స్ కు సంబంధించిన 75 బ్యాంక్ ఖాతాలను గుర్తించారు.
ఇన్ స్టంట్ ఫైనాన్స్ యాప్స్ కు సంబంధించి నాలుగు బ్యాంక్ ఖాతాలల్లో 50 లక్షల రూపాయలు పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతాల నుండే కస్టమర్లకు యాప్స్ నిర్వాహకులు నగదు బదిలీ చేశారు. అయితే.. ఈ కేసులో మధుబాబు అనే వ్యక్తి కీలకం అని పోలీసులు గుర్తించారు. బెంగళూరులో తప్పుడు అడ్రస్ పెట్టి కంపెనీలను ఏర్పాటు చేసి.. అడగకుండానే లోన్లు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు పరారీలో ఉన్న మధుబాబును పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.