144 ఏండ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా టెస్టు మ్యాచ్ లో ఓ మహిళా అంపైర్గా ఉన్నారు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య సిడ్నీ క్రికెట్ మైదానంలో జరుగుతోన్న మూడో టెస్టుకు ఆస్ట్రేలియా మహిళా అంపైర్ క్లెయిర్ పోలోజాక్ నాలుగో(రిజర్వ్) అంపైర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆతిథ్య జట్టు తమ ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్ అంపైర్ల నుంచి నాలుగో అంపైర్ను నియమించుకోవచ్చు. దీంతో 32 ఏండ్ల పోలోజాక్కు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అరుదైన అవకాశాన్ని ఇచ్చింది. పురుషుల టెస్ట్ క్రికెట్లో అంపైర్గా విధులు నిర్వర్తిస్తున్న తొలి మహిళగా పోలోజాక్ చరిత్ర సృష్టించినందుకు అభినందనలు తెలుపుతూ ఐసీసీ ట్వీట్ చేసింది. వరల్డ్ క్రికెట్ లీగ్లో భాగంగా 2019లో నమీబియా, ఒమన్ల మధ్య ఐసీసీ డివిజన్-2 పురుషుల వన్డే మ్యాచ్కు ఆన్ఫీల్డ్ అంపైర్గా ఆమె పనిచేశారు.