కోవిడ్ కారణంగా భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీఅయిన రంజీ ట్రోఫీ 2020-21 సీజన్ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పూర్తిస్థాయి దేశవాళీ సీజన్కు ఆస్కారం లేదని స్పష్టం చేసింది. రంజీ ట్రోఫీని నిర్వహించకపోవడం 87 ఏండ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే రాష్ట్రాల క్రికెట్ సంఘాల కోరిక మేరకు ఈ టోర్నీకి బదులుగా విజయ్ హజారే ట్రోఫీని నిర్వహిస్తామని బీసీసీఐ పేర్కొంది. దీంతోపాటు సీనియర్ విమెన్స్ నేషనల్ వన్డే టోర్నమెంట్, అండర్-19 నేషనల్ వన్డే టోర్నీ వినూ మన్కడ్ ట్రోఫీలను నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి జే షా స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు పంపిన లేఖలో పేర్కొంది.