సిద్దిపేట జిల్లా పొన్నాల శివారులోని నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించారు. భవన నిర్మాణాన్ని, గదులను తిరిగి పరిశీలించారు. అనంతరం టీఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలమైన పునాదులు వేసుకున్న టీఆర్ఎస్ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవన్లను నిర్మించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని సిద్దిపేటలో సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్ రావు, జిల్లా తెరాస నాయకులతో కలిసి ప్రారంభించారు.
రూ.60లక్షలతో నిర్మించిన పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి గతేడాది జూన్ 24న భూమిపూజ నిర్వహించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి.. నిర్దేశించిన గడువులోగా భవన్ నిర్మాణం పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం రాష్ట్రంలోనే మోడల్గా నిలువనున్నది. జీ ప్లస్ 1 పద్ధతిలో ఈ భవనాన్ని నిర్మించారు. ఒకేసారి 1,500 మందితో సమావేశం జరిపేందుకు వీలుగా సెమినార్ హాల్ నిర్మించారు. మోడల్ కిచెన్ షెడ్, టాయిలెట్స్, విశాలమైన పార్కింగ్, ప్రహరీ తదితర పనులన్నీ పూర్తయ్యాయి. భవన్ నిర్మాణానికి రూ.1.5 కోట్లు ఖర్చు అయ్యాయి. హరితహారం, గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా భవన్ చుట్టూ మొక్కలు నాటారు.