72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. తెలంగాణకు 2 రాష్టపతి పోలీసు పతకాలు, 12 పోలీసు పతకాలు దక్కాయి. హైదరాబాద్ అదనపు సీపీ శిఖా గోయల్కు, నిజామాబాద్ ఐజీ శివశంకర్ రెడ్డికి రాష్టపతి పోలీసు పతకాలు వరించాయి.
పోలీసు పతకాలు పొందిన వారు..
రాజేశ్ కుమార్(ఐజీ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్, హైదరాబాద్)
షరీపుద్దీన్ సిద్దిఖీ(కమాండెంట్, టీఎస్ఎస్ఎస్పీ బెటాలియన్ హైదరాబాద్)
కందుకూరి నర్సింగరావు(డీఎస్పీ, నిర్మల్)
సూర్యానారాయణ(డీఎస్పీ, ఏసీబీ రంగారెడ్డి)
గోవర్ధన్ తన్నీరు(ఏసీపీ, హైదరాబాద్)
గుంజ రమేశ్(డిప్యూటీ అసల్ట్ కమాండర్, గ్రే హౌండ్స్)
ఎం ఉద్ధవ్(కానిస్టేబుల్, టీఎస్ఎస్ఎస్పీ 13వ బెటాలియన్, మంచిర్యాల)