‘గిప్ట్ ఏ స్మైల్’లో భాగంగా మినిస్టర్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు రూ.1.23 కోట్ల వ్యయంతో ఆరు నూతన అంబులెన్స్ లను ఎంపీ నామా నాగేశ్వర్రావు అందించారు. ఈ అంబులెన్స్లను సోమవారం మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ అంబులెన్స్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆయా నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రికి అందజేయడం జరుగుతుంది. వీటిని ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్స్ కు కేటాయించనున్నారు. ఈ వాహనాల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ తో సహా అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బండి రమేష్, చిత్తారు సింహాద్రి, నామ పృథ్వి, నామ భవ్య, ఫోర్స్ మోటార్ ప్రతినిధులు పాల్గొన్నారు.