నాగార్జున సాగర్ నియోజకర్గంలో పర్యటిస్తున్న కేసీఆర్ నెల్లికల్ వద్ద నిర్మించనున్న 13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు.. పలుచోట్ల ఆధునీకరణ పనులకు సీఎం నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 13 ఇరిగేషన్ల ద్వారా లక్షా 4వేల 6వందల ఎకరాల టెయిల్ లాండ్ భూములకు సాగునీరు అందనున్నాయి. ఈ ఎత్తిపోతల పథకాలతో హుజూర్నగర్, సాగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి.
శంకుస్థాపన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర నాయక్తో పాలు పలువురు నాయకులు ఉన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సీఎం నాగార్జున సాగర్ లోని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి బయల్దేరారు. అక్కడ భోజనం ముగించుకొని.. మధ్యాహ్నం 3:40కి హాలియాలోని ధన్యవాద సభకు చేరుకుంటారు.