కార్తీకదీపం డైలీ సీరియల్ ఫేమ్ బేబీ కృతిక.. ఆర్టిస్టు ప్రత్యూష ఛాలెంజ్ను స్వీకరించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంది. నార్సింగి సమీపంలోని మంచిరేవుల వద్ద గురువారం మొక్కలు నాటింది. మొక్కలు నాటడం భూమిపై ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా బేబీ కృతిక చెప్పింది. ప్రేమి విశ్వనాథ్(వంటలక్క), డాక్టర్ బాబు నిరూపమ్, ప్రొడ్యుసర్ వెంకటేశ్వర రావు లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటిన బేబీ కృతికకు ఎంపీ సంతోస్కుమార్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు. ఇతర యువతకు స్ఫూర్తిని కలిగించావని బేబీ కృతికను మెచ్చుకున్నారు.