మహిళలపై జరుగుతున్న వేధింపులపై, అక్షరాలే ఆయుధాలుగా రచనలతో సమాజంలో మార్పునకై పాటుపడుతున్న ‘అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫోరమ్’ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. తెలుగు మహిళా రచయితల ఫోరం-అక్షరయాన్ లోని రయిత్రులు రాసిన పుస్తకాలను ఆమె ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత్రి ఐనంపూడి శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో ఫోరంలోని రచయిత్రులు ఎమ్మెల్సీ కవితను హైదరాబాదు లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం ఈ అక్షరయాన్ ‘https://aksharayan.org’ వెబ్ సైట్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.
రచనల ద్వారా మహిళ అభ్యున్నతి కోసం పనిచేస్తున్న మహిళా రైటర్లు, వెబ్ సైట్ రూపకర్తలను కవిత అభినందించారు. “తమిరిశ జానకి గారి కవితల పోటీ” లో గెలుపొందిన రచయిత్రిలకు ఎమ్మెల్సీ కవిత బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, వేణుగోపాలాచారి, పలువురు రచయిత్రులు పాల్గొన్నారు.