నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, అడ్వైజర్ అవినాష్ మిశ్రా, కన్సల్టెంట్ డాక్టర్ నమ్రత సింగ్ పన్వార్, రీసెర్చి ఆఫీసర్ కామరాజు, వైస్ చైర్మన్ పీఎస్ రవీంద్ర ప్రతాప్ సింగ్ లతో కూడిన బృందం ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.