శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో గత కొంత కాలంగా చిరుత పులి సంచరిస్తుందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అటవీ శాఖ సిబ్బంది పెట్టిన నిఘాలో చిరుతకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు, కదలికలు లభ్యం కాలేదు. దీంతో చిరుతకు సంబంధించిన కదలికలను తెలసుకునేందుకు అటవీశాఖ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో కెమెరాలు, బోనులు ఏర్పాటు చేసింది. నిన్న రాత్రి అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాల్లో చిరుతలా ఉండే అడవి పిల్లి చిత్రాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీన్ని బట్టి ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో తిరుగున్నది చిరుత కాదని మంచి ఆరోగ్యంగా, ధృడంగా ఉన్న అడవి పిల్లి అని శంషాబాద్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి సీహెచ్. శివయ్య తేల్చారు. శంషాబాద్ పరిసరాల్లో చిరుత సంచారం లేదని తేలిపోయిందని, స్థానికులు భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.