నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ రహదారి 44పై బైఠాయించారు. రోడ్డుపైనే ఆందోళన నిర్వహించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పంటకు కనీమ మద్దతు ధర కల్పించాలని నినాదాలు చేశారు. ఫస్ట్ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపైనే బైటాయించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకువస్తామని చెప్పి.. గెలిచిన తర్వాత ఎంపీ ముఖం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పసుపుకు మద్దతు ధర కల్పించే వరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. దశలవారీగా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.