జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా రంగానికి చెందిన తారలు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ మక్కల నీది మయ్యమ అనే పార్టీని స్థాపించగా, సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 31న పార్టీపై అధికారిక ప్రకటన చేయనున్నాడు. ప్రస్తుతం పార్టీ జెండా, అజెండా, గుర్తుకు సంబంధించి తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. జనవరి 14, 17 తేదీలలో పార్టీ లాంచింగ్ ఉండొచ్చంటున్నారు రజనీకాంత్ అనుచరులు.

తమిళ పొంగల్ సందర్భంగా జనవరి 14న రజనీకాంత్ తన పార్టీ లాంచ్ చేస్తాడని కొందరు అంటుంటే మరికొందరు జనవరి 17న ఎంజీఆర్ జయంతి సందర్భంగా ప్రారంభిస్తారని అనుకుంటున్నారు. దాదాపు జనవరి 17నే రజనీ పార్టీ ప్రకటన ఫైనల్ అయ్యేలా కనిపిస్తుంది. రజనీకాంత్ తన పార్టీకి కొత్త పేరు కాకుండా ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన ‘మక్కల్ సేవై కట్చి’ (ప్రజాసేవ పార్టీ) పేరునే ఎంచుకోనున్నట్టు సమాచారం. పార్టీ సింబల్గా ఆటో రిక్షా కోసం దరఖాస్తు చేశారు. రాబోవు రాష్ట్రం మొత్తం పోటీ చేస్తామని, అన్ని చోట్లా ఒకటే గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.