తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 12న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ముగ్గుల పోటీలను నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈ నెల 12న(మంగళవారం) ఉదయం 10 గంటల నుండి ముగ్గుల పోటీలు ప్రారంభం కానున్నట్లు తెలంగాణ జాగృతి మహిళా విభాగం అధ్యక్షులు వరలక్ష్మి మంచాల తెలిపారు. ఈ ముగ్గుల పోటీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు.
ముగ్గుల పోటీల్లో విజేతగా నిలిచిన మొదటి ముగ్గురికి ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయన్నారు. పోటీ లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. పోటీలో పాల్గొనేవారు ముగ్గు, ఇతర రంగోలి సామాగ్రిని తమ వెంట తీసుకురావాల్సిందిగా సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ కోరారు.
రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు..
శైలజారావు- 9505942801
కవిత కడుదుల- 9849390560
సుచిత్ర- 9346351287
లతా రావు- 9966278079
బబిత- 8309779329