ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27 లోగా దరఖాస్తు చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ మెరిట్ జాబితాను విడుదల చేస్తామని, మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in ను చూడాలని యూనివర్సిటీ పేర్కొంది.