రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థల నిర్వహణ సాధ్యమేనని అధికారులు వెల్లడించడంతో సీఎం విద్యాసంస్థల పునః ప్రారంభానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. దీంతో 10 నెలలుగా మూతబడిన పాఠశాలలు మరో 20 రోజుల్లో తిరిగి తెరుచుకోనున్నాయి.
పలు కీలక అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సోమవారం మంత్రులు, కలెక్టర్లు, పంచాయతీ రాజ్, రెవెన్యూ, మున్సిపల్, వైద్యారోగ్య, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, అటవీశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన విసయం తెలిసిందే.
