ఎంసెట్లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్ను యథాతథంగా కొనసాగిస్తామని ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ స్పష్టం చేశారు. ఎంసెట్ ఎంట్రన్స్ షెడ్యూల్, సిలబస్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు ఇవాళ విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంసెట్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి 100 శాతం సిలబస్, సెకండియర్ నుంచి 70 శాతం సిలబస్ ప్రకారం ప్రశ్నలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎంసెట్ సిలబస్ను శుక్రవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. జూన్ 14 తర్వాత ఎంసెట్ నిర్వహించే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.