ఈ నెల 7న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో సీెం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ల ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులు హాజరవుతారు.
పార్టీ సభ్యత్వం, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల నియామకం, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారట. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రణాళికలు తదితర అంశాలపై లోతుగా చర్చించనున్నారు.
